
- ఇటుక లారీని ఢీకొని.. కంట్రోల్కాక రివర్స్
- బస్సులోని 20 మందికి గాయాలు
- శంషాబాద్ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం
శంషాబాద్, వెలుగు: కర్ణాటకలోని రాయచూర్నుంచి సిటీకి వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు శంషాబాద్లో అదుపు తప్పి, ముందు వెళ్తున్న ఇటుక లారీని ఢీకొట్టింది. బస్సులోని దాదాపు 20 మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కాలు విరిగింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. శుక్రవారం ఉదయం రాయచూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన హైదరాబాద్ డిపో ఎక్స్ప్రెస్బస్సు(టీఎస్ 09 జెడ్9065) శంషాబాద్వరకు బాగానే వచ్చింది. అక్కడి ఫ్లైఓవర్పైకి ఎక్కుతున్న టైంలో డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు.
ముందు వెళ్తున్న ఇటుక లారీని ఢీకొట్టాడు. రోడ్డు మధ్యలోని డివైర్ఎక్కి లారీ ఆగిపోగా, ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫ్లైఓవర్పైనే కొద్దిదూరం రివర్స్వెళ్లి సైడ్వాల్(సేఫ్టీ ర్యాంప్)ను ఢీకొని ఆగింది. బస్సులోని 20 మంది గాయపడ్డారు. డ్రైవర్వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కాలు విరిగింది. వారందరిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన వారిని ఇతర బస్సుల్లో పంపించారు. కాగా, ఫ్లైవర్ఎక్కుతున్న టైంలో డ్రైవర్ఓ ప్రయాణికుడికి టికెట్ కొట్టేందుకు ప్రయత్నించగా బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. కండక్టర్లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. సైడ్వాల్ఢీకొని ఆగకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని వాపోయారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.